Districts

సెన్ట్స్ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది… – గీతం జాతీయ సెన్ట్స్ ఐఏఈఏ పూర్వ నిపుణుడు డాక్టర్ రామ్ కుమార్

మనవార్తలు ,పటాన్ చెరు:

శాస్త్రం ( సెన్స్డ్ ) సమాజంతో ముడిపడి ఉందని , అది సమాజాన్ని ప్రభావితం చేస్తుందని , అదే సమయంలో సమాజం వల్ల ప్రభావితమవుతుందని భాభా అణు పరిశోధనా సంస్థ పూర్వ డెరైక్టర్ , అంతర్జాతీయ అణుశక్తి సంస్థ భద్రతా నిపుణుడు డాక్టర్ కె.ఎల్.రామకుమార్ అన్నారు . సర్ సీవీ రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ను గుర్తుంచుకోవడానికి , మన జాతి , విశ్వాభివృద్ధి కోసం శాస్త్రవేత్తలు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రతియేటా నిర్వహించే జాతీయ సెన్స్ దినోత్సవాన్ని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ముందస్తుగా రికార్డు చేసిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ , కొత్త శాస్త్రీయ జ్ఞానం నూతన ఆవిష్కరణకు దారితీయొచ్చని , డీఎన్ఏ నిర్మాణం ఆవిష్కరణ జీవశాస్త్రంలో ఒక ప్రాథమిక పురోగతి అని చెప్పారు . ఇది డీఎన్ఏ వేలిముద్రలు , జన్యుపరంగా మార్పిడి చేసిన పంటలు , జన్యు వ్యాధులకు సంబంధించిన పరీక్షలతో సహా అనేక రకాల ఆచరణాత్మక విధానాలకు దారితీసినట్టు వివరించారు .

నిర్మాణాత్మక యోచన శాస్త్రీయ పరిశోధనలను ప్రేరేపించవచ్చని , మలేరియా వంటి వ్యాధులకు మందులను చౌకగా ఉత్పత్తి చేసే అవకాశం ఈ రంగంలోని అనేకమంది పరిశోధకులను సూక్ష్మజీవుల జన్యుశాస్త్రంపై అధ్యయనాలను కొనసాగించడానికి ప్రేరేపిస్తోందన్నారు . శాస్త్రం లేకపోతే సమాజం పురోగమించదని , సమాజానికి ఉపకరించే విధంగా శాస్త్రం తోడ్పడాలని గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ సూచించారు . తొలుత విద్యార్థులందరికీ జాతీయ సెన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు . జాతీయ సెన్ట్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ – టెక్నాలజీలు సంయుక్తంగా జాతీయాభివృ ద్ధిలో శాస్త్ర సహకారం , మెరుగైన భవిష్యత్తు కోసం మన పర్యావరణం సురక్షితంగా ఉందా ? నేటి యువతలో కుటుంబ విలువలు – సంస్కృతి ప్రభావం అనే మూడు అంశాలపై ‘ శాస్త్ర – సాంకేతిక అంశాలపై అఖిల భారత వ్యాసరచన పోటీలను నిర్వహించాయి . మనదేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన 33 మందిని ఆన్లైన్లో మౌఖికంగా విశ్లేషించి , విజేతలను ఎంపిక చేశారు .

 

నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన ఆకాంక్ష చౌహాను రూ .20,000 / – నగదు పురస్కారం , సర్వేల్లోని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలకు చెందిన ఆర్యన్ నూకాకు ద్వితీయ బహుమతిగా రూ .15,000 / – , తృ తీయ బహుమతిగా కేరళ – ఎర్రూర్లోని భవన్స్ విద్యా మందిర్కు చెందిన లావణ్య రాజన్ , న్యూఢిల్లీ – చాణక్యపురిలోని నౌకాదళ పాఠశాలకు చెందిన సమ్రాట్ వశిష్ట్ రూ .10,000 / – , మిగిలిన 26 మందికి ఒక్కొక్కరికి రూ .2,000 / -ల నగదు , ప్రశంసా పత్రాలను ఇచ్చి సత్కరించారు . ఈ కార్యక్రమంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ఇంజనీరింగ్ డెరైక్టర్ వీకే మిట్టల్ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago