– ఈనెల 30 న నిర్వహించే గీతం 13 వ స్నాతకోత్సవంలో ప్రదానం
– ముఖ్య అతిథిగా సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్
మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 13 వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30 న నిర్వహించనున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫెసర్ శాంతా సిన్హాతో పాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ( డీ.లిట్ ) ని ప్రదానం చేయనున్నట్టు ఆయన తెలియజేశారు .
హైదరాబాద్ లోని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని , స్నాతకోపన్యాసం చేయనున్నట్టు వెల్లడించారు . గీతం విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వీరేందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షత జరిగే ఈ స్నాతకోత్సవంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ కూడా పాల్గొంటారని తెలిపారు .
ఈ పదమూడో స్నాతకోత్సవంలో 1,346 మంది విద్యార్థులు పట్టాలను తీసుకోవడానికి అర్హత సాధించారని , అందులో , బీఏ , ఎంఏ , బీబీఏ , బీకాం , ఎంబీఏ , బీఎస్సీ , ఎమ్మెస్సీ , బీటెక్ , ఎంటెక్ , బీఫార్మశీ విద్యార్థులున్నట్టు ప్రోవీసీ పేర్కొన్నారు .
ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…
ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…
ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఖాతాలో మరో అవార్డు దక్కింది .…