Telangana

శాంతా సిన్హా , అంపశయ్య నవీన్ కు – గీతం గౌరవ డాక్టరేట్లు

– ఈనెల 30 న నిర్వహించే గీతం 13 వ స్నాతకోత్సవంలో ప్రదానం

– ముఖ్య అతిథిగా సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 13 వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30 న నిర్వహించనున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫెసర్ శాంతా సిన్హాతో పాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ( డీ.లిట్ ) ని ప్రదానం చేయనున్నట్టు ఆయన తెలియజేశారు .

హైదరాబాద్ లోని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని , స్నాతకోపన్యాసం చేయనున్నట్టు వెల్లడించారు . గీతం విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వీరేందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షత జరిగే ఈ స్నాతకోత్సవంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ కూడా పాల్గొంటారని తెలిపారు .

ఈ పదమూడో స్నాతకోత్సవంలో 1,346 మంది విద్యార్థులు పట్టాలను తీసుకోవడానికి అర్హత సాధించారని , అందులో , బీఏ , ఎంఏ , బీబీఏ , బీకాం , ఎంబీఏ , బీఎస్సీ , ఎమ్మెస్సీ , బీటెక్ , ఎంటెక్ , బీఫార్మశీ విద్యార్థులున్నట్టు ప్రోవీసీ పేర్కొన్నారు .

admin

Recent Posts

ప్రజలు కాంగ్రెస్ ను నమ్మేపరిస్థితి లేదు బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి

  మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ పోషించిన పాత్ర చారిత్రాత్మకమని పటాన్‌చెరు…

7 hours ago

సివిల్ ఇంజనీరింగ్ లో ఆకుల విశాల్ కు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

8 hours ago

మే 10 న పటాన్‌చెరులో 10వ జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు

ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మే 10వ తేదీన పటాన్‌చెరు పీవీ…

8 hours ago

ఈఎస్ ఐ కార్పొరేషన్ నిధులను కార్మికుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాలి

డిస్పెన్సరీలలో డాక్టర్ల కొరతను నివారించాలి సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు ఎండి వాజిద్ అలీ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు…

8 hours ago

మరోసారి భక్తి భావం చాటిన ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత_ ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ శ్రీ మాద్రి పృథ్వీరాజ్ శాస్త్రోక్తంగా మొదలైన శ్రీ ఎల్లమ్మ పోచమ్మ…

2 days ago

లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్ అధినేత సాయిరాం గుప్తా ఆధ్వర్యంలో చలివేంద్రం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్ చెరు పట్టణం ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాయి లక్ష్మీ డాక్యుమెంటరీ రైటర్స్…

2 days ago