– ఈనెల 30 న నిర్వహించే గీతం 13 వ స్నాతకోత్సవంలో ప్రదానం
– ముఖ్య అతిథిగా సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్
మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ 13 వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30 న నిర్వహించనున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పాటుపడిన ప్రొఫెసర్ శాంతా సిన్హాతో పాటు ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్లకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ( డీ.లిట్ ) ని ప్రదానం చేయనున్నట్టు ఆయన తెలియజేశారు .
హైదరాబాద్ లోని సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ వినయ్ కె నందికూరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని , స్నాతకోపన్యాసం చేయనున్నట్టు వెల్లడించారు . గీతం విశ్వవిద్యాలయం కులపతి ప్రొఫెసర్ వీరేందర్ సింగ్ చౌహాన్ అధ్యక్షత జరిగే ఈ స్నాతకోత్సవంలో గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ కూడా పాల్గొంటారని తెలిపారు .
ఈ పదమూడో స్నాతకోత్సవంలో 1,346 మంది విద్యార్థులు పట్టాలను తీసుకోవడానికి అర్హత సాధించారని , అందులో , బీఏ , ఎంఏ , బీబీఏ , బీకాం , ఎంబీఏ , బీఎస్సీ , ఎమ్మెస్సీ , బీటెక్ , ఎంటెక్ , బీఫార్మశీ విద్యార్థులున్నట్టు ప్రోవీసీ పేర్కొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…