పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంబరాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా నాయకురాలు గడ్డ పుణ్యవతి అధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్ చెరు మాజీ జడ్పీటిసి బిఅర్ఎస్ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మరియు పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ బోగీ, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలిపారు .భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలను తెలుగు సంస్కృతిని ప్రతిపాదించడమే పండుగలు ముఖ్య ఉద్దేశం అని ఇటువంటి పండుగల యొక్క గొప్పతనాన్ని సాంప్రదాయాన్ని మరవకూడదని నేటి తరానికి కూడా సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం తెలియజేయడానికి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాలను నిర్వహించమని , మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ముగ్గుల పోటీలు అని తెలిపారు .ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వైస్ ఎంపీపీ స్వప్న,బిజేపి రాష్ట్ర నాయకులు దేవేందర్ గౌడ్ , మాజీ ఎంపీటీసీ గడ్డి యాదయ్య , మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…