Telangana

పటాన్చెరు లో ఘనంగా సురక్షా దినోత్సవం

_శాంతి భద్రతలో మేటి తెలంగాణ పోలీస్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఏర్పడటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు విభాగంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అయిన ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని అన్నారు. ప్రధానంగా పోలీసు శాఖపై ప్రజలకు మంచి అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రారంభించిన ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలు పోలీసులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు వీలు ఏర్పడిందని అన్నారు. ఆధునాతన టెక్నాలజీని వినియోగించుకుని తెలంగాణ పోలీస్ దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు.  ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే హాక్‌ఐ, లాస్ట్‌ రిపోర్టు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వేదికల ద్వారా ఫిర్యాదు చేస్తూ.పోలీసుల సేవలు పొందుతున్నారని తెలిపారు.

మరో పక్క క్షేత్రస్థాయిలో ఉండే పెట్రోలింగ్‌ సిబ్బంది ఇంటివద్దకే వెళ్లి బాధితుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామంలో నేరం జరిగితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణమే చర్యలు తీసుకునే వ్యవస్థ ఏర్పడిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. సంస్థాగతపరంగా పోలీసు శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, వేలాది పోస్టులు భర్తీ చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం రక్తదానం చేసిన యువకులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి భీమ్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సురేందర్ రెడ్డి, వేణు కుమార్, వినాయక రెడ్డి, డి ఐ లల్లు నాయక్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ రెడ్డి, ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీ అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మెరాజ్ ఖాన్, సందీప్, సునీల్ రెడ్డి, రామకృష్ణ, యువకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

భవిష్యత్తుకు తగ్గ అధ్యాపకులను తీర్చిదిద్దుతాం

గీతం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో డాక్టర్ రిచా శర్మ మనవార్తలు ప్రతినిధి ,…

9 hours ago

*రియల్ హీరో సోనుసూద్ చేతుల మీదుగా ఘనంగా అశ్య ఫుడ్స్ ప్రోడక్ట్ లాంచ్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:  ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…

22 hours ago

కాంగ్రెస్ కక్ష రాజకీయాలకు హైకోర్టు చెక్

“కాళేశ్వరం నిజం బయటపడింది  బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…

2 days ago

మహిళల భద్రత సామాజిక బాధ్యత

పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మహిళలు భయం లేకుండా…

2 days ago

ఆర్టీసీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్‌సీయూ డిపో మరియు మియాపూర్…

2 days ago

కథనం భావోద్వేగంతో అనుసంధానం కావాలి

గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…

2 days ago