Telangana

పటాన్చెరు లో ఘనంగా సురక్షా దినోత్సవం

_శాంతి భద్రతలో మేటి తెలంగాణ పోలీస్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఏర్పడటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు విభాగంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అయిన ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు శాఖలో తెచ్చిన సంస్కరణలు విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని అన్నారు. ప్రధానంగా పోలీసు శాఖపై ప్రజలకు మంచి అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రారంభించిన ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలు పోలీసులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు వీలు ఏర్పడిందని అన్నారు. ఆధునాతన టెక్నాలజీని వినియోగించుకుని తెలంగాణ పోలీస్ దేశంలోని ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు.  ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే హాక్‌ఐ, లాస్ట్‌ రిపోర్టు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వేదికల ద్వారా ఫిర్యాదు చేస్తూ.పోలీసుల సేవలు పొందుతున్నారని తెలిపారు.

మరో పక్క క్షేత్రస్థాయిలో ఉండే పెట్రోలింగ్‌ సిబ్బంది ఇంటివద్దకే వెళ్లి బాధితుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామంలో నేరం జరిగితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణమే చర్యలు తీసుకునే వ్యవస్థ ఏర్పడిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. సంస్థాగతపరంగా పోలీసు శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, వేలాది పోస్టులు భర్తీ చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం రక్తదానం చేసిన యువకులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి భీమ్ రెడ్డి, ఎస్ హెచ్ ఓ లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సురేందర్ రెడ్డి, వేణు కుమార్, వినాయక రెడ్డి, డి ఐ లల్లు నాయక్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ రెడ్డి, ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, ఎంపీటీసీ అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మెరాజ్ ఖాన్, సందీప్, సునీల్ రెడ్డి, రామకృష్ణ, యువకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీసీ కెమెరాలు ఏర్పాటుతోనే శాంతిభద్రతలు డీసీపీ చింతమనేని శ్రీనివాస్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.…

24 hours ago

కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న బిస్లరీ యాజమాన్యం

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…

1 day ago

విద్యార్థుల ఆత్మబంధువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ. 35 లక్షల రూపాయల సొంత నిధులతో…

1 day ago

మరోసారి ఉదారతను చాటిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన…

2 days ago

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్‌చెరు…

2 days ago

పెండింగ్ లో ఉన్న భూసర్వే సమస్యలు వెంటనే పరిష్కరించాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని…

2 days ago