_కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు విశ్వసించడం లేదు
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనికుడు వలె పని చేయాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల సంతోషంగా ఉన్నారని అన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…