పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లో గురువారం ప్రముఖ పద్మవిభూషణ్ రుక్మిణీ దేవి అరుండేల్ 120వ జయంతి వేడుకలను నిర్వహించి, భరత నాట్యానికి ఆమె అందించిన అమూల్యమెన కృషికి హృదయపూర్వక నివాళులు అర్పించారు. తొలుత, భరతనాట్య ఆచార్యురాలు అక్షయ జనార్ధనన్, తోటి అధ్యాపకులు, పలువురు విద్యార్థులతో కలిసి రుక్మిణీ దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలరిప్పు, తిల్లానాలతో పాటు వివిధ ఆకర్షణీయమెన భరతనాట్య వ్యక్తీకరణలతో కూడిన ప్రదర్శన ద్వారా ఆమె భరతనాట్య వారసత్వానికి నివాళులర్పించారు.గంటపాటు సాగిన ఈ నృత్య ప్రదర్శన సంప్రదాయాన్ని చెతన్యంతో పెనవేసుకుని, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మార్మోగింది.రుక్మిణీ దేవి జీవితం, భరత నాట్యానికి ఆమె చేసిన సేవల గురించి డాక్టర్ లలిత సింధూరి వివరించగా, బీఏ-సైకాలజీ , బీటెక్ (సీఎస్ఈ- ఎఐ అండ్ ఎంఎల్) విద్యార్థులు ఉమా శ్రీనిధి, మనస్వి బోడపాటి అక్షయ అభినయంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా రుక్మిణీ దేవిపై డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు.
మొక్కలు నాటి వినూత్న వీడ్కోలు
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం,హై దరాబాద్ లో చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ వీడ్కోలు దినోత్సవాన్ని ప్రాంగణంలో మొక్కలు నాటడం ద్వారా, వర్సిటీతో వారి బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీబీఏ, బీకాం, ఫార్మసీ, బీఏ, ఎంఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర చివరి ఏడాది విద్యార్థులు తలకు ఒకటి చొప్పున మామిడి, జామ, అవకాడు, దానిమ్మ, నిమ్మ, రావి, వేప వంటి పలు పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటి, ఓ జీవితకాలం నిలిచి ఉండే ఈ మొక్కలు, గీతమ్ లో తమ సమయాన్ని శాశ్వతమైన జ్ఞాపకంగా మలుచుకున్నారు.అటు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ఇటు తాము చదువుకున్న విద్యా సంస్థతో శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవడం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఆ మొక్కలు బొగ్గుపులుసు వాయువును తగ్గించడమే కాక, భూ కోతను నిరోధించడానికి, నేలను స్థిరీకరించి, సహజ నీటి వడపోతను పెంపొందించడంలో సహకరిస్తాయని ఆయా విద్యార్థులు చెప్పారు.గీతం స్టూడెంట్ లైఫ్ పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో గీతం తోటపని సిబ్బంది సహకారంతో ఈ వీడ్కోలు వేడుక విజయవంతంగా ముగిసింది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…