Telangana

గీతమ్ లో రుక్మిణీ దేవి అరుండేల్ 120వ జయంతి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లో గురువారం ప్రముఖ పద్మవిభూషణ్ రుక్మిణీ దేవి అరుండేల్ 120వ జయంతి వేడుకలను నిర్వహించి, భరత నాట్యానికి ఆమె అందించిన అమూల్యమెన కృషికి హృదయపూర్వక నివాళులు అర్పించారు. తొలుత, భరతనాట్య ఆచార్యురాలు అక్షయ జనార్ధనన్, తోటి అధ్యాపకులు, పలువురు విద్యార్థులతో కలిసి రుక్మిణీ దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలరిప్పు, తిల్లానాలతో పాటు వివిధ ఆకర్షణీయమెన భరతనాట్య వ్యక్తీకరణలతో కూడిన ప్రదర్శన ద్వారా ఆమె భరతనాట్య వారసత్వానికి నివాళులర్పించారు.గంటపాటు సాగిన ఈ నృత్య ప్రదర్శన సంప్రదాయాన్ని చెతన్యంతో పెనవేసుకుని, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మార్మోగింది.రుక్మిణీ దేవి జీవితం, భరత నాట్యానికి ఆమె చేసిన సేవల గురించి డాక్టర్ లలిత సింధూరి వివరించగా, బీఏ-సైకాలజీ , బీటెక్ (సీఎస్ఈ- ఎఐ అండ్ ఎంఎల్) విద్యార్థులు ఉమా శ్రీనిధి, మనస్వి బోడపాటి అక్షయ అభినయంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా రుక్మిణీ దేవిపై డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు.

మొక్కలు నాటి వినూత్న వీడ్కోలు

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం,హై దరాబాద్ లో చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ వీడ్కోలు దినోత్సవాన్ని ప్రాంగణంలో మొక్కలు నాటడం ద్వారా, వర్సిటీతో వారి బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, బీబీఏ, బీకాం, ఫార్మసీ, బీఏ, ఎంఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర చివరి ఏడాది విద్యార్థులు తలకు ఒకటి చొప్పున మామిడి, జామ, అవకాడు, దానిమ్మ, నిమ్మ, రావి, వేప వంటి పలు పండ్ల, నీడనిచ్చే మొక్కలను నాటి, ఓ జీవితకాలం నిలిచి ఉండే ఈ మొక్కలు, గీతమ్ లో తమ సమయాన్ని శాశ్వతమైన జ్ఞాపకంగా మలుచుకున్నారు.అటు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ఇటు తాము చదువుకున్న విద్యా సంస్థతో శాశ్వత సంబంధాన్ని ఏర్పరచుకోవడం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. ఆ మొక్కలు బొగ్గుపులుసు వాయువును తగ్గించడమే కాక, భూ కోతను నిరోధించడానికి, నేలను స్థిరీకరించి, సహజ నీటి వడపోతను పెంపొందించడంలో సహకరిస్తాయని ఆయా విద్యార్థులు చెప్పారు.గీతం స్టూడెంట్ లైఫ్ పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో గీతం తోటపని సిబ్బంది సహకారంతో ఈ వీడ్కోలు వేడుక విజయవంతంగా ముగిసింది.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago