ప్రభుత్వ నిబంధనలకు లోబడి సేవలు అందించాలి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్ఎంపి, పిఎంపి వైద్యుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎంపి, పిఎంపిలు ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేసి పలు ఆర్.ఎం.పి, పి.ఎం.పి క్లినిక్ లను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలని వారికి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిస్క్రిప్షన్లు, పరీక్షలు నిర్వహించకూడదని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జిల్లా వైద్యాధికారిణి గాయత్రీ దేవితో మాట్లాడి.. భవిష్యత్తులో ఆర్.ఎం.పి, పి.ఎం.పి లు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయకుండా చూస్తామని తెలిపారు. నిబంధనలో ఉల్లంగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…