Hyderabad

ఘనంగా డబ్ల్యు.హెచ్. ఆర్. ఏ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం రెండో వార్షికోత్సవ వేడుకలు మియపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ చైర్మన్ మొరం రెడ్డి సుబ్బారెడ్డి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దినేష్ కుమార్, సీఈవో సురేష్ రెడ్డి లు పాల్గొని కేక్ కట్ చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ చైర్మన్ తౌట్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి ప్రజలకు దగ్గరైన సంస్థ ఏదైనా ఉంది అంటే అది ప్రపంచ మానవ హక్కుల సంఘం అని గర్వంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి ఎదుర్కొంటూ అనేకమందికి న్యాయం జరిగే విధంగా గా సంస్థలోని సభ్యులందరూ ఐకమత్యంగా పనిచేస్తూ ముందున్నారని కొనియాడారు. ముందు ముందు భవిష్యత్తులో ప్రపంచ మానవ హక్కుల సంఘం నుండి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పదవులు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాల నుండి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, చైర్పర్సన్లు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago