పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మనదేశంలోని వివిధ ఫౌండేషన్లు, పరిశోధనా సంస్థల నుంచి గీతం అధ్యాపకులకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయినట్టు గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.భరణి చంద్రకుమార్ కు లోపాలను అధిగమిస్తూ, తప్పును తట్టుకుని నీటి అడుగున ప్రయాణించే వాహన నమూనా రూపకల్పన కోసం ఐఐటీ గౌహతి సాంకేతిక ఆవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ (ఐఐటీజ్-టీఐడీఎఫ్) రూ.11 లక్షల గ్రాంటును మంజూరు చేసినట్టు తెలిపారు. అదే స్కూల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రఫుల్ల కుమార్ స్వెన్కు రేకుల కదలికతో నీటి అడుగున నడిచే వాహనం రూపకల్పన, అభివృద్ధి కోసం గౌహతి సాంకేతిక అవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ రూ.10 లక్షల గ్రాంటును మంజూరు చేసిందన్నారు. దీనికి అదనంగా, స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని ఫెనాన్స్ విభాగం ప్రొఫెసర్ ఎం. జయశ్రీకి భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నుంచి ఓ నమూనాతో పర్యావరణ, సమాజం, పరిపాలన (ఈఎస్), సంస్థ పనితీరుపై అధ్యయనం చేయడానికి గాను భారత విద్యా మంత్రిత్వ శాఖ ఐసీఎస్ఎఎస్ఆర్ ద్వారా రూ.8 లక్షల గ్రాంటును మంజూరు చేసినట్టు ఆయన నెల్లడించారు.విశిష్ట విజయాలతో పాటు పరిశోధనా రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రొఫెసర్ భరణి చంద్ర కుమార్, డాక్టర్ ప్రఫుల్ల కుమార్ స్వెన్, ప్రొఫెసర్ జయశ్రీలను వీసీ అభినందించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…