పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మనదేశంలోని వివిధ ఫౌండేషన్లు, పరిశోధనా సంస్థల నుంచి గీతం అధ్యాపకులకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయినట్టు గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.భరణి చంద్రకుమార్ కు లోపాలను అధిగమిస్తూ, తప్పును తట్టుకుని నీటి అడుగున ప్రయాణించే వాహన నమూనా రూపకల్పన కోసం ఐఐటీ గౌహతి సాంకేతిక ఆవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ (ఐఐటీజ్-టీఐడీఎఫ్) రూ.11 లక్షల గ్రాంటును మంజూరు చేసినట్టు తెలిపారు. అదే స్కూల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రఫుల్ల కుమార్ స్వెన్కు రేకుల కదలికతో నీటి అడుగున నడిచే వాహనం రూపకల్పన, అభివృద్ధి కోసం గౌహతి సాంకేతిక అవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ రూ.10 లక్షల గ్రాంటును మంజూరు చేసిందన్నారు. దీనికి అదనంగా, స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని ఫెనాన్స్ విభాగం ప్రొఫెసర్ ఎం. జయశ్రీకి భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నుంచి ఓ నమూనాతో పర్యావరణ, సమాజం, పరిపాలన (ఈఎస్), సంస్థ పనితీరుపై అధ్యయనం చేయడానికి గాను భారత విద్యా మంత్రిత్వ శాఖ ఐసీఎస్ఎఎస్ఆర్ ద్వారా రూ.8 లక్షల గ్రాంటును మంజూరు చేసినట్టు ఆయన నెల్లడించారు.విశిష్ట విజయాలతో పాటు పరిశోధనా రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రొఫెసర్ భరణి చంద్ర కుమార్, డాక్టర్ ప్రఫుల్ల కుమార్ స్వెన్, ప్రొఫెసర్ జయశ్రీలను వీసీ అభినందించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…