పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మనదేశంలోని వివిధ ఫౌండేషన్లు, పరిశోధనా సంస్థల నుంచి గీతం అధ్యాపకులకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయినట్టు గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.భరణి చంద్రకుమార్ కు లోపాలను అధిగమిస్తూ, తప్పును తట్టుకుని నీటి అడుగున ప్రయాణించే వాహన నమూనా రూపకల్పన కోసం ఐఐటీ గౌహతి సాంకేతిక ఆవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ (ఐఐటీజ్-టీఐడీఎఫ్) రూ.11 లక్షల గ్రాంటును మంజూరు చేసినట్టు తెలిపారు. అదే స్కూల్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రఫుల్ల కుమార్ స్వెన్కు రేకుల కదలికతో నీటి అడుగున నడిచే వాహనం రూపకల్పన, అభివృద్ధి కోసం గౌహతి సాంకేతిక అవిష్కరణ, అభివృద్ధి ఫౌండేషన్ రూ.10 లక్షల గ్రాంటును మంజూరు చేసిందన్నారు. దీనికి అదనంగా, స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని ఫెనాన్స్ విభాగం ప్రొఫెసర్ ఎం. జయశ్రీకి భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ నుంచి ఓ నమూనాతో పర్యావరణ, సమాజం, పరిపాలన (ఈఎస్), సంస్థ పనితీరుపై అధ్యయనం చేయడానికి గాను భారత విద్యా మంత్రిత్వ శాఖ ఐసీఎస్ఎఎస్ఆర్ ద్వారా రూ.8 లక్షల గ్రాంటును మంజూరు చేసినట్టు ఆయన నెల్లడించారు.విశిష్ట విజయాలతో పాటు పరిశోధనా రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రొఫెసర్ భరణి చంద్ర కుమార్, డాక్టర్ ప్రఫుల్ల కుమార్ స్వెన్, ప్రొఫెసర్ జయశ్రీలను వీసీ అభినందించారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…