Telangana

పరిశోధనే ప్రగతికి సోపానం: డాక్టర్ అనువ్రత్ శర్మ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధన ఆవశ్యకత పెరిగిందని, శోధనే పురోగతికి మైలురాయిగా మారిందని అను స్పెక్ట్రా కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు, డైరక్టర్ డాక్టర్ అనుప్రీత్ శర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘నర్చరింగ్ రీసెర్చ్’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలలో విద్య, పరిశోధనా అవకాశాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. చాలా ఫార్మా ఉద్యోగాలకు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్ డీ వరకు నిర్దిష్ట స్థాయి అర్హత, పరిశోధనా ఉత్సాహాన్ని కలిగి ఉండాలన్నారు. ఫార్యాస్యూటికల్ రంగంలో ఒక బలమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి తన ఉపన్యాసం ఎంతో దోహదపడుతుందంటూ, సపేరే- ఆడే అంటే డేరింగ్ టు కాన్సెప్ట్ గురించి ప్రసంగించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులను ప్రోత్సహించడానికి, నిగూఢమైన పరిశోధనా ప్రపంచంలోని రహస్యాలను ఛేదించడంలో తనవంతు తోడ్పాటునందించారు. పరిశోధనలకు విద్య, నైతికల , నెతిక విలువల బలమైన పునాది అవసరమని, ఇవన్నీ గీతం వంటి విద్యా సంస్థల కోర్సుల బోధనా సమయంలోనే పెంపొందిస్తారని చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్, అతిథికి ఘన స్వాగతం పలికి, విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన విశేష అనుభవాలను పంచుకున్నందుకు సత్కరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గటడి శ్రీకాంత్ వందన సమర్పణతో ఈ ఉపన్యాస కార్యక్రమం ముగిసింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago