Telangana

పరిశోధనే ప్రగతికి సోపానం: డాక్టర్ అనువ్రత్ శర్మ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధన ఆవశ్యకత పెరిగిందని, శోధనే పురోగతికి మైలురాయిగా మారిందని అను స్పెక్ట్రా కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు, డైరక్టర్ డాక్టర్ అనుప్రీత్ శర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘నర్చరింగ్ రీసెర్చ్’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలలో విద్య, పరిశోధనా అవకాశాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. చాలా ఫార్మా ఉద్యోగాలకు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్ డీ వరకు నిర్దిష్ట స్థాయి అర్హత, పరిశోధనా ఉత్సాహాన్ని కలిగి ఉండాలన్నారు. ఫార్యాస్యూటికల్ రంగంలో ఒక బలమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి తన ఉపన్యాసం ఎంతో దోహదపడుతుందంటూ, సపేరే- ఆడే అంటే డేరింగ్ టు కాన్సెప్ట్ గురించి ప్రసంగించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులను ప్రోత్సహించడానికి, నిగూఢమైన పరిశోధనా ప్రపంచంలోని రహస్యాలను ఛేదించడంలో తనవంతు తోడ్పాటునందించారు. పరిశోధనలకు విద్య, నైతికల , నెతిక విలువల బలమైన పునాది అవసరమని, ఇవన్నీ గీతం వంటి విద్యా సంస్థల కోర్సుల బోధనా సమయంలోనే పెంపొందిస్తారని చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్, అతిథికి ఘన స్వాగతం పలికి, విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన విశేష అనుభవాలను పంచుకున్నందుకు సత్కరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గటడి శ్రీకాంత్ వందన సమర్పణతో ఈ ఉపన్యాస కార్యక్రమం ముగిసింది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

5 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago