బీసీ బంద్ ప్రకటించాలని తహసీల్దార్ కి వినతి …
రామచంద్రాపురం :
రాష్ట్రoలో ఉన్న బీసీ కులాల వారందరికీ బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం రోజు సంగారెడ్డి జిల్లా… రామచంద్రాపురం ఎమ్మార్వో శివ కుమార్ కు బీసీ సంఘం సంగారెడ్డి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
తోలిగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ బ్యానర్ తో ప్రదర్శన నిర్వహించారు.బీసీబంద్ ప్రకటించకపోతే కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో. ఆర్.ఐ దీక్షిత్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ ఎన్. కృష్ణ, వాటర్ బాడీ మాజీ చైర్మన్ నర్సింహ, తెల్లాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరణి రాజు, పాండు యాదవ్, సురేష్ చారి, కిట్టు ముదిరాజ్, మున్సిపల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి శివ శంకర్, వనపర్తి ఉప సర్పంచ్ యూ. లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…