మనవార్తలు , పటాన్ చెరు:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే కవాతులో పాల్గొనడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ ఎంపికయ్యారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగే నెల రోజుల శిక్షణలో ఈ విద్యార్థి పాల్గొననున్నారు .
గణతంత్ర దినోత్సవానికి సన్నాహకంగా జల్గావ్లోని కవయిత్రి బహినాబాయి చౌధరి ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో అరుణ్ పాల్గొని విజయవంతంగా పూర్తిచేశారు . కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పూనెలోని ప్రాంతీయ ఎన్ఎస్ఎస్ డెరైక్టరేట్ ఈ ముందస్తు శిబిరాన్ని నిర్వహించింది . అరుణ్ దినకరన్ గతంలో అంతర్ జిల్లా హాకీ పోటీలలో నాలుగు ప్రతిభా మెడలతో పాటు ఫుట్బాల్ టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్ పురస్కారాన్ని కూడా పొందారు .
ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఫుట్బాల్ టీమ్ సభ్యుడిగా కూడా సేవలందిస్తున్నారు . విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గణతంత్ర దినోత్సవ కవాతుకు గీతం విద్యార్థి ఎంపిక కావడం పట్ల రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్ర కుమార్ తదితరులు హర్షం వెలిబుచ్చి , అరుణ్ను అభినందించారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…