మనవార్తలు ,పటాన్ చెరు:
దసరా పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని బుధవారం ముత్తంగి చర్చ్ పక్కన మైదానంలో నిర్వహించిన దసరా సంబరాల్లో పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజలకు దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు, అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించి దసరా పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసిన యస్.ఆర్.కె యువసేన సభ్యులకు ఆయన ప్రశంసించారు.రావణ దహన ఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, నరసింహ గౌడ్, పవన్, అశ్వంత్, బాబు రాజ్ గౌడ్, ఈశ్వరయ్య, రామ్ రెడ్డి, కృష్ణ, బైండ్ల కుమార్, కిట్టు ముదిరాజ్, దేవెందర్ గౌడ్, సురేష్, అంజద్, శ్రీధర్ గౌడ్, ప్రభాకర్, మల్లేష్, సుజాత, పున్యవతి, యస్.ఆర్.కె యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…