విజ్ఞాన్ విద్యా సంస్థపై డీఈఓకు ఫిర్యాదు…
పటాన్ చెరు:
గత మూడు రోజుల క్రితం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ శివారులోని విజ్ఞాన్ విద్యా సంస్థలో జరిగిన నూతన అడ్మిషన్లపై మండల విద్యాధికారి రాథోడ్ ఆ సంస్థకు నోటీసు జారీ చేశారు.
సదరు నోటీసుకు విజ్ఞాన్ విద్యా సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని శుక్రవారం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశానని ఎంఈఓ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాథోడ్ మాట్లాడుతూ…
పాఠశాల యాజమాన్యం పనితీరు మండల విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు.
మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థుల వివరాలను ఇవ్వాలని ఆదేశించినట్టు గానే విజ్ఞాన్ విద్యా సంస్థకు కూడా తమ సిబ్బంది తెలియజేశారన్నారు. మండల పరిధిలోని ఇతర ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు విధులు నిర్వహించినట్టు గాని, నూతన అడ్మిషన్లు జరిగిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కేవలం విజ్ఞాన్ విద్యాసంస్థ మాత్రమే ఉపాధ్యాయులచేత విధులు నిర్వహింపజేస్తూ, నూతన అడ్మిషన్ సైతం తీసుకున్నట్టు తన దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ సదరు విద్యాసంస్థ ఇచ్చిన వివరణ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగానే ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…
బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…
అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్…