విజ్ఞాన్ విద్యా సంస్థపై డీఈఓకు ఫిర్యాదు…
పటాన్ చెరు:
గత మూడు రోజుల క్రితం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ శివారులోని విజ్ఞాన్ విద్యా సంస్థలో జరిగిన నూతన అడ్మిషన్లపై మండల విద్యాధికారి రాథోడ్ ఆ సంస్థకు నోటీసు జారీ చేశారు.
సదరు నోటీసుకు విజ్ఞాన్ విద్యా సంస్థ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని శుక్రవారం జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశానని ఎంఈఓ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాథోడ్ మాట్లాడుతూ…
పాఠశాల యాజమాన్యం పనితీరు మండల విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు.
మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థుల వివరాలను ఇవ్వాలని ఆదేశించినట్టు గానే విజ్ఞాన్ విద్యా సంస్థకు కూడా తమ సిబ్బంది తెలియజేశారన్నారు. మండల పరిధిలోని ఇతర ఏ పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు విధులు నిర్వహించినట్టు గాని, నూతన అడ్మిషన్లు జరిగిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
కేవలం విజ్ఞాన్ విద్యాసంస్థ మాత్రమే ఉపాధ్యాయులచేత విధులు నిర్వహింపజేస్తూ, నూతన అడ్మిషన్ సైతం తీసుకున్నట్టు తన దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ సదరు విద్యాసంస్థ ఇచ్చిన వివరణ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగానే ఉందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…