Telangana

రామచంద్రపురం 112 డివిజన్ నూతన బీజేపీ అధ్యక్షుడుగా ఎన్ నర్సింగ్ గౌడ్

మనవార్తలు ,రామచంద్రపురం:

సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం 112 వ డివిజ‌న్ అధ్య‌క్షుడిగా నియమించ‌డం ప‌ట్ల ఎన్ న‌ర్సింగ్ గౌడ్ సంతోషం వ్య‌క్తం చేశారు .సామాన్య కార్య‌క‌ర్త స్థాయి నుంచి డివిజన్ స్థాయి అధ్య‌క్షుడిగా నియ‌మించిన బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు న‌రేంద‌ర్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు . జిల్లా అధ్య‌క్షులు న‌రేందర్ రెడ్డి చేతుల మీదుగా రామ‌చంద్రాపురం 112 వ డివిజ‌న్ అధ్య‌క్షుడిగా బీజేపీ నేత‌లు ,కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌క్షంలో నియామ‌క ప‌త్రాన్ని అందుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు .

తెలంగాణ‌లో జ‌రిగే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని ఈ స‌మావేశాల‌కు దేశంలోని బీజేపీ పాలిత ప్రాంత ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు ,ఎంపీలు రానున్న‌ట్లు ఆయ‌న తెలిపారు . సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్ లో జ‌రిగే ప్ర‌ధాని మోడీ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కార్యకర్తలతో, ప్రజలతో నిరంతరం సేవలో నిమగ్నమై పార్టీ అభివృద్ధికై కృషి చేస్తాన‌ని ఎన్ న‌ర్సింగ్ గౌడ్ అన్నారు . రాబోయే ఎన్నికలలో పటాన్ చేరు నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగుర వేస్తామని ధీమా వ్య‌క్తం చేశారు . యువతకు క్రికెట్ కిట్ ల‌ను అందజేయడం జరిగిందని  రానున్న రోజులలో అనేక సేవ కార్యక్రమంలో చేప‌డ‌తామ‌న్నారు . బిజెపి పార్టీ కార్యకర్తలు, మహిళలు , అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి మహేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకులు గోదావరి అంజి రెడ్డి , పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్త, రామచంద్రపురం ప్రధాన కార్యదర్శి పద్మ వతి,రామ్ ప్రసాద్ గుప్త, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా రవి, ఓబీసీ మోర్చా టౌన్ అధ్యక్షులు రవి యాదవ్, జిల్లా మహిళా మోర్చా పాదాదికారులు కవిత మరియు అనూష , కారికే ప్రవీణ్ , బలరాం, పట్టణ ఉపదక్షులు మల్లేష్ , ప్రహ్లదు సింగ్ , పి విష్ణువర్ధన్ రెడ్డి , కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు .

admin

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

4 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

5 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

5 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

5 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago