Telangana

ప్రశ్నించడమే ప్రగతికి సోపానం

గీతం చర్చాగోష్ఠిలో వక్తలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఏదైనా తెలియని అంశం గురించి అడిగి తెలుసుకోవాలని, ప్రశ్నించే తత్త్వం ఆలోచనను పెంపొందించి, పురోగతికి తోడ్పడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్-లోని ట్రైనింగ్ అండ్ కాంపిటెన్స్ క్రాఫ్టర్స్ (టీసీడీ) ఆధ్వర్యంలో ‘పని యొక్క భవిష్యత్తును రూపొందించడం: బహుళ విభాగ నైపుణ్యాలు, జీవితకాల అభ్యాసం, వ్యక్తిగత గుర్తింపు’ అనే అంశంపై మంగళవారం చర్చాగోష్ఠిని నిర్వహించారు. ఇందులో గీతం పూర్వ విద్యార్థులతో సహా విభిన్న పరిశ్రమ అనుభవం ఉన్న వ్యక్తులు పాల్గొన్నారు.బహుళ విభాగ నైపుణ్యాల ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ, సాంకేతిక పురోగతులు అన్ని పరిశ్రమలను పునర్నిర్మిస్తున్నాయని, రంగంతో సంబంధం లేకుండా విభిన్న సామర్థ్యాలను అవలంబించడం చాలా అవసరమని హెచ్ఆర్ కన్సల్టెంట్ నేహా గుప్తా అన్నారు. విద్యార్థులు ధోరణులను గుడ్డిగా అనుసరించవద్దని, ఉపాధిని పెంపొందించే నైపుణ్యాలను పొందడంపై దృష్టి పెట్టాలని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఇండియా కన్సల్టెంట్, గీతం పూర్వ విద్యార్థి శ్రీహర్ష సూచించారు. బీటెక్ (ఈసీఈ) చదివిన తాను క్లౌడ్ కంప్యూటింగ్-కి మారిన తన అనుభవాన్ని హిటాచీ వంటారాలో అడ్వాన్స్డ్ క్లౌడ్ కన్సల్టెంట్, గీతం పూర్వ విద్యార్థిని ఐశ్వర్య భాస్కరభట్ట వివరించారు. కొత్త వాటిని నేర్చుకోవాలనే తపన, ప్రశ్నించే తత్త్వం, జీవితకాల అభ్యాసాలు వ్యక్తి ఎదుగుదలకు తోడ్పడతాయన్నారు.

కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సొంత కన్సల్టింగ్ సంస్థను స్థాపించడానికి జరిగిన పరివర్తనపై మూవ్-మెంట్స్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు, డెలాయిట్ పూర్వ ఉపాధ్యక్షుడు దీపక్ లాల్ మాట్లాడుతూ, నైపుణ్యాలను నేర్చుకోవడం, వాటిని వ్యక్తిగత బ్రాండింగ్-లోకి అనువదించడం, అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. పరివర్తన ఒక్క రోజులో జరగదని, విద్యార్థులు సరైన దిశలో అవకాశాల కోసం అప్రమత్తంగా ఉండాలని శ్రీహర్ష సూచించారు. వ్యక్తిగత బ్రాండ్-ను పెంచుకోవడానికి లింక్డ్ఇన్ మంచి వేదికని నేహా అభిప్రాయపడ్డారు.సాఫ్ట్ స్కిల్స్, నెట్-వర్కింగ్-లకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇది వారి కెరీర్-పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఐశ్వర్య అన్నారు. విద్యార్థులు తమ సొంత వెంచర్లు ప్రారంభించడానికి వెనుకాడవద్దని, ప్రాథమిక అంశాలపై మంచి అవగాహనను ఏర్పరచుకోవాలని విద్యార్థులను ఆమె ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు సంధించిన పలు ప్రశ్నలకు ప్యానలిస్టులు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు.

బీటెక్ విద్యార్థులు బి.వంశిక సాయి, ఎం.అక్షిత ఈ చర్చాగోష్ఠిని సమన్వయం చేయగా, డాక్టర్ రూత్ జర్ధోమాని హౌజెల్ వందన సమర్పణ చేశారు. టీసీడీ డైరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జీసీజీసీ డైరెక్టర్ డాక్టర్ మమతారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమాకాంత్ బాల్, టీసీడీ ఇంటర్న్స్ వై.వైష్ణవ్ కిరీటి, సంప్రీత్ పార్సి, వినమ్ర వాస్వానీ, పలు విభాగాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago