_సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు ముందుండాలి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, కేజి నుండి పీ జీ వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్ చెరు మండలం బానూరు గ్రామ పరిధిలోని కంచర్ల గూడెం లో 50 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధుల తో నిర్మించతలపెట్టిన ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణం కోసం లహరి రిసార్ట్స్ యజమాని హరిబాబు తొమ్మిది గుంటల స్థలాన్ని, నిర్మాణ ఖర్చును అందజేసేందుకు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. గ్రామీణ స్థాయిలో సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…