పటాన్ చెరువు
పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన హరి పంతుల పుష్ప వెంకట్ రావు గారు సోమవారం బీజేపీలో చేరారు.పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర లో పాల్గొని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. దేశం కోసం మన ప్రధాని నరేంద్రమోడీ ఎంతో కృషి చేస్తున్నాడని ఆమె అన్నారు. 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కాయమని ఆమె తెలిపారు . ప్రజాసంగ్రామ యాత్రలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు మండల బీజేపీ అధ్యక్షులు ఈశ్వరయ్య, దేవెంతర్ గౌడ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…