పటాన్ చెరువు
పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన హరి పంతుల పుష్ప వెంకట్ రావు గారు సోమవారం బీజేపీలో చేరారు.పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర లో పాల్గొని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. దేశం కోసం మన ప్రధాని నరేంద్రమోడీ ఎంతో కృషి చేస్తున్నాడని ఆమె అన్నారు. 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కాయమని ఆమె తెలిపారు . ప్రజాసంగ్రామ యాత్రలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు మండల బీజేపీ అధ్యక్షులు ఈశ్వరయ్య, దేవెంతర్ గౌడ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: దేశ వ్యాప్త పల్స్…
ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేటి తరం యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని…
పటాన్చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం మనవార్తలు…
బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు రెండు వారాల పాటు మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వియత్నాంలోని…