పటాన్ చెరువు
పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన హరి పంతుల పుష్ప వెంకట్ రావు గారు సోమవారం బీజేపీలో చేరారు.పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర లో పాల్గొని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. దేశం కోసం మన ప్రధాని నరేంద్రమోడీ ఎంతో కృషి చేస్తున్నాడని ఆమె అన్నారు. 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కాయమని ఆమె తెలిపారు . ప్రజాసంగ్రామ యాత్రలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు మండల బీజేపీ అధ్యక్షులు ఈశ్వరయ్య, దేవెంతర్ గౌడ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…