Telangana

రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రజానేత కేటీఆర్ _ చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా సోమవారం చిట్కుల్ గ్రామంలో తుల్జా భవాని దేవాలయంలో నీలం మధురాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇస్నాపూర్ చౌరస్తాలో అభిమానులు, బి ఆర్ఎస్ కార్యకర్తల, ప్రజల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు .హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం కింద వికలాంగులకు 4,016 రూపాయిలు పెంచిన సందర్భంగా కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు .ఇస్నాపూర్ గ్రామంలో దివ్యాంగుల జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభించి ,ఇద్దరు దివ్యాంగులకు జీవనోపాధి కి ఉపయోగపడేలా రెండు కుట్టు మిషన్లను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పంపిణీచేశారు.

కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొనిఇంద్రేశం గ్రామ శివారులో మదర్ తెరెసా వృద్ధాశ్రమం లో కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి ,అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ,అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడి అందించే పరిశ్రమలు తీసుకురావడంలో కేటీఆర్ పాత్ర కీలకమని ఆయన తెలిపారు.అలాగే తెలంగాణ ప్రజల సంక్షేమ పథకాల అమల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారని , మరోపక్క రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రజానేత అని అన్నారు ఇలాంటి నాయకుడికి పది కాలాలపాటు చల్లగా ఉండాలని తెలంగాణ ప్రజలు ఆశీర్వచనం అందజేయాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతంగా నిలపడం లో మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి మర్చిపోలేమని తెలిపారు .ఈ కార్యక్రమాల్లో ప్రజలు,పార్టీ కార్యకర్తలు, అభిమానులు,ఎన్ఎమ్ అర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago