హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు..
హైదరాబాద్:
నగరంలోని బంజారాహిల్స్ నందినగర్లో మరోసారి ఆకతాయిలు రెచ్చిపోయారు. అకారణంగా ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. ఇదేంటని అడిగేందుకు వెళ్లిన వారి స్నేహితులపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దుండగుల దాడిలో కొరియోగ్రాఫర్తో పాటు ఆర్ట్ డైరెక్టర్లకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 20 మంది దాడిలో పాల్గొన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా నందినగర్ గ్రౌండ్స్లో దారిన పోయేవారిపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దాడిలో పాల్గొన్న వారి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…