Districts

పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన దీక్షలు

_పటాన్చెరు, రామచంద్రపురం నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

_చివరి గింజ కొనే వరకు జంగ్ కొనసాగిస్తాం

మనవార్తలు,పటాన్‌చెరు:

రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించారు. రామచంద్రాపురం, పటాన్చెరు లో నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం పండించిన చివరి ధాన్యం గింజని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రైతాంగానికి మద్దతుగా పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు.

గతంలో పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తే రాష్ట్ర బిజెపి నాయకులు వరి పంటను సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టారని అన్నారు. నేడు పంట కొనుగోలు విషయంలో బిజెపి నాయకులు చేతులెత్తేయడం వాడి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆరోపించారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతన్న నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మూలంగా అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వన్ నేషన్- వన్ ప్రోక్యూర్మెంట్ విధానాన్ని వెంటనే దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే వారం రోజుల్లో జాతీయ రహదారి దిగ్బంధం, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago