Telangana

రక్తదాతలను ప్రశంసించిన ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు

రక్తదానం ప్రాణదానంతో సమానం

ప్రశంసా పత్రాలను అందజేసిన రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి విద్యార్థి చేసే రక్తదానం ఆపదలో ఉన్న మరో వ్యక్తి లేదా వ్యక్తులకు ఉపయోగపడుతుందని గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), చరైవేతి విద్యార్థి విభాగాలు శుక్రవారం సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు సౌజన్యంతో, ‘రక్తదానం చేయండి, జీవితాన్ని దానం చేయండి’ ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించే ప్రభావం గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శిబిరానికి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది నుంచి విశేషమైన స్పందన కనిపించింది. ఈ శిబిరాన్ని నిర్వహించడంలో విద్యార్థుల అంకితభావాన్ని ప్రోవీసీ ప్రొఫెసర్ డీ.ఎస్. రావు ప్రశంసించారు. ఇలాంటి మానవతా ప్రయత్నాలలో నిరంతరం పాల్గొనాలని ఆయన ప్రోత్సహించారు. రక్తదానం విలువను నొక్కి చెబుతూ, ఇందులో స్వచ్ఛందంగా పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.

గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, రక్తదానం విశిష్టత, తద్వారా దాత, గ్రహీతలు ఇద్దరికీ ఒనగూరే ప్రయోజనాల గురించి వివరించారు. దాతలకు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తలు, విద్యార్థి నాయకులతో కలిసి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ శిబిరంలో 300 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించినట్టు ఎన్టీఆర్ ట్రస్టు వైద్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ శైలజ, అడ్మినిస్ట్రేషన్ హెడ్ మాధవి తెలియజేశారు. రక్తదానాన్ని ‘జీవిత బహుమతి’గా వారు అభివర్ణిస్తూ, ప్రతి దానం వివిధ వైద్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ఎర్ర రక్తకణాలు, ప్లేట్-లెట్లు, ప్లాస్మాను అందించడం ద్వారా చాలామంది జీవితాలను కాపాడవచ్చని చెప్పారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago