పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులకు న్యూఢిల్లీలోని శాస్త్ర, సాంకేతిక పరిశోధనా బోర్డు (సెర్చ్) నుంచి రెండు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయినట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టెమ్ సెల్ లను లక్ష్యంగా చేసుకుని అధ్యయనం చేసే ప్రాజెక్టుకు రూ.65.06 లక్షలను మంజూరు చేసినట్టు తెలిపారు. స్కూల్ ఆఫ్ సైన్స్ లోని బయో కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ రామారావు మల్లా ప్రధాన పరిశోధకుడిగా (పీఐ), అదే విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ పి. కిరణ్మయి సహ పరిశోధకురాలిగా (కో-పీఐ)గా వ్యవహరిస్తారన్నారు. అయస్కాంత, అయిస్కాంతం కాని పదార్థాల కోసం విద్యుదయస్కాంత విధ్వంసం చేయని విధానాన్ని అభివృ ద్ధి చేయడం కోసం రూ.32.40 లక్షల నిధులను స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ అంగాని ప్రధాన పరిశోధకుడిగా, డాక్టర్ రవికుమార్ గురజాడ సహ పరిశోధకుడిగా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు ఆయన వివరించారు. వీటికి అదనంగా, జీవప్రేరణతో, దూరం నుంచి నీటి లోపల నడప గల వాహనం రూపకల్పన, అభివృద్ధి కోసం ఐఐటీ , హైదరాబాద్ రూ.10 లక్షల నిధులను కేటాయించినట్టు తెలిపారు. జార్ఖండ్ (జంషెడ్ పూర్ )లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్ఐటీ) చేపడుతున్న ఈ ప్రాజెక్టులో, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ ప్రపుల్ల కుమార్ స్వెన్ సహ ప రిశోధకుడిగా వ్యవహరిస్తారన్నారు.స్వీయ పరిశోధన, ప్రతిభలతో తాము చేపడుతున్న అధ్యయనానికి పరిశోధనా గ్రాంటులను జాతీయ సంస్థల నుంచి పొందిన గీతం అధ్యాపకులను ప్రొఫెసర్ దయానంద సిద్ధపెట్టం అభినందించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…