politics

గీతం అధ్యాపకులకు ప్రతిష్ఠాత్మక పరిశోధనా ప్రాజెక్టులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులకు న్యూఢిల్లీలోని శాస్త్ర, సాంకేతిక పరిశోధనా బోర్డు (సెర్చ్) నుంచి రెండు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టులు మంజూరయినట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టెమ్ సెల్ లను లక్ష్యంగా చేసుకుని అధ్యయనం చేసే ప్రాజెక్టుకు రూ.65.06 లక్షలను మంజూరు చేసినట్టు తెలిపారు. స్కూల్ ఆఫ్ సైన్స్ లోని బయో కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ రామారావు మల్లా ప్రధాన పరిశోధకుడిగా (పీఐ), అదే విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ పి. కిరణ్మయి సహ పరిశోధకురాలిగా (కో-పీఐ)గా వ్యవహరిస్తారన్నారు. అయస్కాంత, అయిస్కాంతం కాని పదార్థాల కోసం విద్యుదయస్కాంత విధ్వంసం చేయని విధానాన్ని అభివృ ద్ధి చేయడం కోసం రూ.32.40 లక్షల నిధులను స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ అంగాని ప్రధాన పరిశోధకుడిగా, డాక్టర్ రవికుమార్ గురజాడ సహ పరిశోధకుడిగా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు ఆయన వివరించారు. వీటికి అదనంగా, జీవప్రేరణతో, దూరం నుంచి నీటి లోపల నడప గల వాహనం రూపకల్పన, అభివృద్ధి కోసం ఐఐటీ , హైదరాబాద్ రూ.10 లక్షల నిధులను కేటాయించినట్టు తెలిపారు. జార్ఖండ్ (జంషెడ్ పూర్ )లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్ఐటీ) చేపడుతున్న ఈ ప్రాజెక్టులో, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ ప్రపుల్ల కుమార్ స్వెన్ సహ ప రిశోధకుడిగా వ్యవహరిస్తారన్నారు.స్వీయ పరిశోధన, ప్రతిభలతో తాము చేపడుతున్న అధ్యయనానికి పరిశోధనా గ్రాంటులను జాతీయ సంస్థల నుంచి పొందిన గీతం అధ్యాపకులను ప్రొఫెసర్ దయానంద సిద్ధపెట్టం అభినందించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

2 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago