Telangana

గీతంలో నేటి నుండి ప్రమాణ 2024 ఫెస్ట్

_గీతమ్ లో మొద‌లైన ప్రమాణ సందడి 

_ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్న సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైద‌రాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక పండుగ ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో విభిన్నమైన సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాల మేలు కలయికగా సాగుతుందని, వేలాది మంది విద్యార్థులను ఈ ఫెస్ట్ ఆకర్షించడమే గాక వారిలోని ప్రతిభ, నైపుణ్యం, సాంస్కృతిక వినోదాన్ని ప్రదర్శించే వేదికగా ఉపకరిస్తుందన్నారు. ప్రమాణ-2024 ప్రచారంలో భాగంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ ను నిర్వహించడంతో పాటు పలు కళాశాలలకు ఈ సమాచారాన్ని చేరవేసినట్టు వారు వివరించారు. ఇప్పటికే పలు సాంకేతిక కార్యక్రమాలు, వ‌ర్క్ షాప్ లు నిర్వహించామ‌ని పాల్గొన్న విద్యార్థులందరికీ ధ్రువీకరణ పత్రాలను అందజేశామన్నారు. అపోలో ఆస్పత్రుల సామాజిక సేవ (సీఎస్ఆర్) ఉపాధ్యక్షురాలు ఉపాసన కామినేని కొణిదెల ముఖ్య అతిథిగా, విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ గడ్డం వంశీకృష్ణ, ప్రారంభ వేడుకలలో ఆత్మీయ అతిథిగా పాల్గొని, ప్రమాణ-2024ను లాంఛనంగా ఆరంభిస్తారని తెలిపారు. ఎన్ టీ టీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ప్రాంతీయ అధినేత సంజీవ్ దేశ్ పాండే రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని, ఈ ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చాటిన వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తారన్నారు. తొలి రోజు నిర్వహించే త్రీవరీ బ్యాండ్ కు కొనసాగింపుగా రెండో రోజు రామ్ మిర్యాల, సాహితీ చాగంటి తను పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించనున్నట్టు తెలియజేశారు. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, సంప్రదాయ నృత్యాలు, ర్యాంప్ వాక్, కార్నివాల్, ఆటో ఎక్స్ పో, విద్యార్థులతో స్కిట్లు, పలు ప్రదర్శనలతో పాటు మనదేశంలోనే పేరొందిన డీజే ప్రాజెక్టు 91, మధ్య స్కాట్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ డీజే నినా సూర్టే ఈ మూడు రోజుల ఫెస్ట్ లో ఆహూతుల జోష్ ను పెంచనున్నట్టు వారు వివరించారు.గీతం విద్యార్థులతో పాటు జంట నగరాల చుట్టుపక్కల నుంచి, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ ఫెస్ట్ లో పాల్గొనడానికి ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారని, దాదాపు ఇరవైవేల మంది పాల్గొననున్నట్టు స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు తెలియజేశారు.

 

 

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago