Telangana

పోతన భాగవతం – అలంకారశిల్పం’ గ్రంథావిష్కరణ

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

అలంకార శాస్త్రం పై పరిమితంగా పరిశోధనలు జరుగుతున్న ఈ కాలంలో పోతన రాసిన మహా భాగవతంలో అలంకార శిల్పం గురించి పరిశోధన చేయడం ఎంతో విశేషమైన కృషిగా ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యాఖ్యానించారు. పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్న డాక్టర్ గొట్టే శ్రీనివాసరావు తన పరిశోధన గ్రంథం ’పోతన భాగవతం – అలంకారశిల్పం’ ను గురువారం తెలుగు శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పిల్లలుమర్రి రాములు ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తూ మహాకావ్యమైన ఆంధ్ర మహాభాగవతం పై పరిశోధన చేయడమే ఒక విశేషం అయితే దానిలోని అలంకారాలపై సమగ్రంగా అధ్యయనం చేయడం అత్యంత ప్రశంసనీయమని ఆయన అన్నారు. ఆచార్య పిల్లలమర్రి రాములు గారి దగ్గర ఇప్పటివరకు సుమారు 30 పీహెచ్డీలు 40 ఎంఫిల్ పరిశోధనలు జరిగినప్పటికీ ఇదే తొలి పీహెచ్డీ కావడం ఒక విశేషమని ఆచార్య దార్ల పేర్కొన్నారు. గ్రంథరచయిత డాక్టర్ గొట్టే శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను చదువుకొని పరిశోధన చేసిన తెలుగు శాఖలోనే తన పర్యవేక్షకుడి చేతుల మీదగా తన గ్రంథం ఆవిష్కరణ కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎం. గోనానాయక్ , ఆచార్య పమ్మి పవన్ కుమార్ ,ఆచార్య డి. విజయలక్ష్మి, ఆచార్య పి.వారిజారాణి, ఆచార్య త్రివేణి వంగరి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి, డా.లచ్చయ్య, డా.భగ్గునాయక్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago