Telangana

క్రీడలతో శారీరక దారుఢ్యం ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :

క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్లో పండు టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీజన్ 8 రాష్ట్ర స్థాయి మ్యాట్ కబడ్డీ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాలుగా అమీన్పూర్ వేదికగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. స్వతహాగా క్రీడలు అంటే తనకు ఇష్టమని, కబడ్డీ అంటే అమిత ఆసక్తి అన్నారు. నియోజకవర్గ పరిధిలో క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. కబడ్డీ పోటీలకు రెండు లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న పోటీలలో 60 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ దేవానంద్, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, కబడ్డీ సంఘం ప్రతినిధి ఎల్లయ్య, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago