Hyderabad

ప్ర‌ముఖ తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌పై ఫోటో ఎగ్జిబిషన్ …

హైదరాబాద్:

భార‌త స్వాతంత్య్రోద్య‌మం, అలాగే హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడిన ప్ర‌ముఖ తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్‌రీచ్‌ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఆధ్వ‌ర్యంలో మాదాపూర్ శిల్పారామం(హైద‌రాబాద్‌)లో ఆగ‌స్టు 13 నుంచి 17 వ‌ర‌కు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. విదేశీ పాల‌న నుంచి భార‌త‌దేశాన్ని విముక్తి చేయ‌డానికి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు చేసిన త్యాగాలు, పూర్వ హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడి హైద‌రాబాద్ రాష్ట్రాన్ని ఇండియ‌న్ యూనియ‌న్‌లో విలీనం చేయ‌డానికి ప్ర‌ముఖుల కృషిని ప్ర‌స్తుత త‌రానికి తెలియ‌జేయ‌డ‌మే ఈ ఫోటో ఎగ్జిబిష‌న్ ల‌క్ష్యం. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్స‌వ్ లో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటుచేశారు.

ఈ ఎగ్జిబిష‌న్‌లో కుమురం భీం, చాక‌లి ఐల‌మ్మ‌, స్వామి రామానంద తీర్థ‌, అల్లూరి సీతారామ‌రాజు, టంగుటూరి ప్ర‌కాశం పంతులు త‌దిత‌రుల పాత్రను ఈ ఫోటోలు ప్ర‌స్తుత త‌రానికి క్లుప్తంగా వివ‌రిస్తాయి. మాదాపూర్ శిల్పారామం స‌హ‌కారంతో ఏర్పాటుచేసిన‌ ఈ ఎగ్జిబిష‌న్లో 30 ఫోటోల‌తో పాటు ఒక ఫోటో బూత్‌, సిగ్నేచ‌ర్ బోర్డుల‌ను కూడా సంద‌ర్శ‌న‌కు ఉంచారు. కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప్ర‌చుర‌ణ‌ల విభాగం స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్త‌క‌ ప్ర‌ద‌ర్శ‌నను ఏర్పాటుచేసింది.

 

ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో, రీజ‌న‌ల్ ఔట్‌రీచ్ బ్యూరో సౌత్‌జోన్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్ శుక్ర‌వారం ప్రారంభించి మాట్లాడుతూ స్వాత్రంత్య్ర పోరాట యోధుల త్యాగాల‌ను స్మ‌రించుకోవ‌డానికి ఈ ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటుచేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌లు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఎగ్జిబిష‌న్‌ను సంద‌ర్శించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌వోబీ డైరెక్ట‌ర్ శృతిపాటిల్‌, డిప్యూటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణ‌కాంత్‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కృష్ణ వంద‌న, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago