భారత స్వాతంత్య్రోద్యమం, అలాగే హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఆధ్వర్యంలో మాదాపూర్ శిల్పారామం(హైదరాబాద్)లో ఆగస్టు 13 నుంచి 17 వరకు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు, పూర్వ హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి ప్రముఖుల కృషిని ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ ఫోటో ఎగ్జిబిషన్ లక్ష్యం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేశారు.
ఈ ఎగ్జిబిషన్లో కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు తదితరుల పాత్రను ఈ ఫోటోలు ప్రస్తుత తరానికి క్లుప్తంగా వివరిస్తాయి. మాదాపూర్ శిల్పారామం సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్లో 30 ఫోటోలతో పాటు ఒక ఫోటో బూత్, సిగ్నేచర్ బోర్డులను కూడా సందర్శనకు ఉంచారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన ప్రచురణల విభాగం స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్తక ప్రదర్శనను ఏర్పాటుచేసింది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…