Telangana

ప్రజల నిర్ణయమే ఫైనల్

అమీన్పూర్ ఎస్టిపిని తరలిస్తాం లేదా రద్దు

అవసరమైతే ముఖ్యమంత్రితో సైతం చర్చిస్తాము

ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు పై ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ :

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అమీన్పూర్ లో ఏర్పాటు చేయదలచిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టిపి ) ను తరలించడం లేదా రద్దు చేయడం జరుగుతుందని.. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని 993 సర్వే నంబర్లో ఎస్ టి పి ఏర్పాటు చేయనున్న స్థలంలో శనివారం ఆయా కాలనీల ప్రజలతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ పరిధిలోని మురుగు నీటి జలాలను శుద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా తమకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానిక కాలనీల ప్రజల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు తలెత్తుతున్న నేపథ్యంలో మెజార్టీ ప్రజలు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి అనుగుణంగా ఎస్టిపిని తరలించడం లేదా రద్దు చేసేందుకు ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిపారు.

అవసరమైన పక్షంలో ముఖ్యమంత్రి దృష్టికి సైతం తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమీన్పూర్ లో ఎస్టీపీని ఏర్పాటు చేయడం జరగదని స్పష్టం చేశారు. అత్యంత అవసరమైతే ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేసి నక్కవాగులోకి తరలించడం జరుగుతుందని తెలిపారు. పనులను వెంటనే నిలిపివేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ప్లాంట్ ఏర్పాటుపై రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, జలమండలి సిజిఎం పద్మజ, జిఎం సుబ్బారాయుడు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago