Telangana

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్ చెరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పూర్తిస్థాయిలో పని చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని కోరారు.

అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్లు, 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ , పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించే నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని అధికారులను, ప్రజా ప్రతినిధులు కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న మొట్టమొదటి నియోజవర్గం పటాన్చెరు అని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా నియోజకవర్గంలో 90% క్రీడా ప్రాంగణాలు ప్రారంభించడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

పటాన్ చెరు మండల పరిధిలోనీ 9 అంగన్ వాడి కేంద్రాల భవనాల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని, ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ముత్తంగి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎల్లప్పుడు తాను ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా పటాన్ చెరు బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంతో 16 కోట్ల రూపాయలతో భారీ ఆడిటోరియం నిర్మిస్తున్నామని తెలిపారు.

ఎన్నికల సమయాల్లోనే రాజకీయాల గురించి మాట్లాడాలని, తదనంతరం ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా చర్చలు జరగాలని కోరారు. ప్రస్తుత హైటెక్ యుగంలోనూ కొన్ని కొన్ని చోట్ల బాల్యవివాహాలు జరుగుతున్నాయని, పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సుప్రజ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, తాసిల్దార్ మహిపాల్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

11 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago