ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :
బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు . కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కేఆర్ మురహరి రెడ్డిని షేక్ బాజి , కర్నూలు మైనార్టీ మోర్చా అధ్యక్షులుహావిలిన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు .ముస్లీం, క్రిస్టియన్ మైనారిటీలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలుసుకోవాలన్నారు . కేంద్ర ప్రభుత్వం హిందూ ,ముస్లీంలనే తేడా లేకుండా అందరికి సమన్యాయం చేస్తుందన్నారు .ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా మెలుగుతారని ఇతర పార్టీల నేతలు హిందూ ,ముస్లీంల మధ్య చీలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు . అనంతరం రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు షేక్ బాజీ ,జిల్లా అధ్యక్షుడు హావీలిన్ బాబు , మురహరిరెడ్డి మైనారిటీల అభివృద్ధి కోసం బీజేపీ తీసుకు వచ్చిన కార్యక్రమాల కరపత్రం విడుదల చేశారు .
ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు కిరణ్ కుమార్ , పట్టణ ప్రధాన కార్యదర్శి జేట్టెప్పా ,రాష్ట్ర మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షుడు కరిముల్ల ,జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ వర్మ , జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణ ,జిల్లా మైనారిటీ మౌర్చ ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా పాల్గొన్నారు
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…