Telangana

పెన్షనర్లకు కనీస వేతనం 9వేలు ఇవ్వాలి_ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి

భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం ముందు

పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, వినతి పత్రం అందజేత

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు

పెన్షనర్లకు కనీస వేతనం తొమ్మిది వేలు ఇవ్వాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ అఫ్ ఈపి ఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ( ఏఐయు ఏసిఈపిఎ)కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోరాట ఎజెండా లో భాగంగా, టిఏపీ ఆర్ పిఎ జిల్లా కమిటీ మూడు రోజుల ధర్నా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు జిల్లా కమిటీ సభ్యులతో పాటు ఈపిఎఫ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం ముందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నా నిర్వహించారు అనంతరం భవిష్యనిది ప్రాంతీయ కార్యాలయం ఉప కమిషనర్ సురేంద్ర రావు కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పెన్షనర్స్ ఉద్దేసించి రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది ఈపీఎఫ్ పెన్షనర్లకు గౌరవప్రదమైన పెన్షన్ ప్రయోజనాన్ని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పెన్షనర్ల కుటుంబాలు కనీస అవసరాలు తీరక అత్యంత దయనీయ బతుకులు వెల్లదీస్తున్నారని వాపోయారు. పెన్షనర్లు చేస్తున్న విజ్ఞప్తులు, ధర్నాలు, ఉద్యమాలు, ఆందోళనలు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ల హింస వేతనం పెంచాలని లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.టిఏపీ ఆర్ పిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రామారావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ జె. వెంకటరెడ్డి,ఎం. దేవేంద్రా చారి, ఎం సత్యన్నారాయణ పాటి,సెక్రటరీస్ బి ఎల్ నాయుడు,టి ప్రభాకరరావు, సినియర్ పెన్షనర్ లు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

6 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

6 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

6 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago