Telangana

యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా పెద్దగొల్ల మల్లేష్ యాదవ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పట్టణం యాదవ సంఘం ఉపాధ్యక్షులుగా పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ నియామకమయ్యారు. ఆదివారం పటాన్ చెరు పట్టణం యాదవ సంఘం కార్యవర్గాన్ని, యాదవ సంఘం సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతవారం యాదవ సంఘం అధ్యక్షునిగా దేవయ్య యాదవ్ ను ఎన్నుకున్న సంగతి విధితమే. ఈ సందర్భంగా యాదవ సంఘం ఉపాధ్యక్షులు పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ  గతవారం యాదవ సంఘం అధ్యక్షుడిని, ఇప్పుడు ఉపాధ్యక్షుడు, కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. సభ్యులందరితో కలిసి యాదవ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. యాదవ సంఘం సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ల సలహాలు, సూచనలతో యాదవ సంఘం అభ్యున్నతికి కష్టపడి పని చేస్తామని తెలిపారు. తమ నియామకానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన యాదవ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్, కార్యవర్గం సభ్యులు కృష్ణ, నర్సింహ, మల్లేష్, బిక్షపతి యాదవ్, మల్లేష్ యాదవ్, నర్సింలు యాదవ్, భీమన్న యాదవ్, శ్రీశైలం యాదవ్, వెంకటేష్ యాదవ్, జంగులు యాదవ్, నాగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

11 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago