Districts

యూపీలో రైతుల దుర్మరణం- పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట….

ఖమ్మం :

సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 10 నెలల నుండి ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖిం పూర్ ఖీరి జిల్లాలో జరిగిన ఒక ఘటనలో రైతులు కొంత మంది దుర్మరణం చెందటం పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట అని , జెమిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్ .హెచ్. పి. ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రునాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు . లఖింపూర్ ఖిరి జిల్లాలోని తికునియాలో ఓ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య హాజరు కానున్న సందర్భాన్ని పురస్కరించుకొని మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు రైతులు అక్కడ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న

సమయంలో మరో మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులు నల్లజెండాలు నొప్పి కారును అడ్డుకున్నప్పుడు వారిపై తన కారును దుసుకొని పోనివ్వడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారని రైతు సంఘాల ఆరోపణ , ఈ ఘటన అనంతరం జరిగిన హింసాత్మక ఈ సంఘటనలో మరో ఎనిమిది మంది మృతి చెందటం విచారకరం . మంత్రులు , ప్రభుత్వ అధికారుల వాదన , మరో వైపు రైతులు , రైతు సంఘాల వాదననలు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ రైతులు మృతి చెందడం నిజం . రైతుల ఉద్యమాన్ని పాశవికంగా అణచివేయాలని క్రూరంగా ప్రవర్తించడం కూడా నిజం. పోయినా ప్రాణాలు ఏ విధంగానూ తిరిగి రావు అని తెలిసినప్పటికీ ప్రాణాలను హరించడం పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు .

ఇటీవల ఢిల్లీలో రైతుల ఉద్యమం పై స్పందించిన సుప్రీం కోర్టు ఈ ఘటనపై కూడా స్పందించి , జుడిషియల్ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు . ఎన్నికలు సమీపిస్తున్నా తరుణంలో రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న యోగి – బిజెపి ప్రభుత్వం ఇప్పటికే హిందూ – ముస్లిం రాజకీయాన్ని ప్రారంభించిందని , మరోవైపు రైతులపై దౌష్ట్యానికి దిగిందని , మేధావులు , ప్రజాస్వామ్యవాదులు , ఉద్యమకారులు , సామాన్య ప్రజలు సైతం దీనిని గమనించి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago