డియర్ పవన్ కల్యాణ్ అంటూ ప్రకటన
హైదరాబాద్:
రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినీ రంగ సమస్యలపై మోహన్ బాబు వంటి పెద్దలు స్పందించాలని, ఏపీలో తన బంధువులైన వైసీపీ నాయకులతో మాట్లాడి చిత్ర పరిశ్రమను హింసించొద్దని మోహన్ బాబు చెప్పాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీనిపై మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమైన పవన్ కల్యాణ్ అంటూ ఓ ప్రకటన చేశారు. నా చిరకాల మిత్రుడి సోదరుడైన పవన్ కల్యాణ్… నువ్వు నాకంటే చిన్నవాడివి కాబట్టి ఏకవచనంతో సంబోధించాను అని వెల్లడించారు.
అయితే పవన్ కల్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదని పేర్కొన్నారు. చాలా కాలానికి తనను ఈ వ్యవహారంలోకి లాగావు… సంతోషం అంటూ పవన్ ను ఉద్దేశించి మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ‘మా’ ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది, అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు ముగిసిన తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు హృదయపూర్వకంగా సమాధానం చెబుతానని మోహన్ బాబు స్పష్టం చేశారు.‘మా’ ఎన్నికల్లో తన కుమారుడు మంచు విష్ణు పోటీ చేస్తున్నాడని, పవన్ కల్యాణ్ తన కుమారుడుమంచు విష్ణు ప్యానెల్ కు ఓటేయాలని మోహన్ బాబు ఈ సందర్భంగా సూచించారు.
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని క్రీడలు, ఎన్.సీ.సీ. డైరెక్టరేట్ ఆధ్వర్యంలో, నేషనల్ క్యాడెట్…
బీరంగూడలో ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యం పరిరక్షణకు యోగ అత్యంత అవసరమని ప్రతి ఒక్కరి…