పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ఆసుపత్రిలో చికిత్స పొందే రోగుల రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలని, ఫలితంగా కొన్ని న్యాయపరమైన చిక్కులు నెలకొన్న సందర్భాలలో ఈ రికార్డులే కీలకమవుతాయని ఎస్.శశిధర్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, పాన్ ఇండియా సంయుక్త న్యాయ అవగాహన కార్యక్రమంలో బాగంగా శనివారం చిట్కుల్ మహేశ్వర మెడికల్ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు చోటు చేసుకుంటుందని, అందరికీ న్యాయం అందే దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు.
జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ గతంలో బాల్యవివాహాలు విరివిగా జరిగేవని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి డిజిటలైజేషన్ పథకాల వల్ల మైనార్టీ తీరకుండా ఎవరు వివాహాలు చేయడం లేదన్నారు. పింఛన్ల వల్ల ఆయా కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం నెలకొందని, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం పౌష్టికాహారం అందేలా కృషి చేస్తుందని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ముహూర్తాలు పెట్టి సిజేరియన్ లు చేయమనే సంస్కృతి పెరిగిందని దీన్ని డాక్టర్లు ప్రోత్సహించవద్దన్నారు. జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ రోగుల విషయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు నిర్మాణ రంగ కార్మిక లబ్దిదారులకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయంతో పాటు, మహిళలకు ఆసరా పింఛన్లను అతిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు హనుమంతరావు, ఆర్డీఓ నాగేష్, మహేశ్వర మెడికల్ కళాశాల డైరెక్టర్ కృష్ణారావు, డీన్ సవిత తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…