Telangana

రోగుల రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలి: జిల్లా న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ఆసుపత్రిలో చికిత్స పొందే రోగుల రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలని, ఫలితంగా కొన్ని న్యాయపరమైన చిక్కులు నెలకొన్న సందర్భాలలో ఈ రికార్డులే కీలకమవుతాయని ఎస్.శశిధర్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, పాన్ ఇండియా సంయుక్త న్యాయ అవగాహన కార్యక్రమంలో బాగంగా శనివారం చిట్కుల్ మహేశ్వర మెడికల్ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు చోటు చేసుకుంటుందని, అందరికీ న్యాయం అందే దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ గతంలో బాల్యవివాహాలు విరివిగా జరిగేవని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి డిజిటలైజేషన్ పథకాల వల్ల మైనార్టీ తీరకుండా ఎవరు వివాహాలు చేయడం లేదన్నారు. పింఛన్ల వల్ల ఆయా కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం నెలకొందని, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం పౌష్టికాహారం అందేలా కృషి చేస్తుందని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగిందన్నారు. ముహూర్తాలు పెట్టి సిజేరియన్ లు చేయమనే సంస్కృతి పెరిగిందని దీన్ని డాక్టర్లు ప్రోత్సహించవద్దన్నారు. జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ రోగుల విషయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు నిర్మాణ రంగ కార్మిక లబ్దిదారులకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయంతో పాటు, మహిళలకు ఆసరా పింఛన్లను అతిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు హనుమంతరావు, ఆర్డీఓ నాగేష్, మహేశ్వర మెడికల్ కళాశాల డైరెక్టర్ కృష్ణారావు, డీన్ సవిత తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

5 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

8 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago