Districts

పటేల్ గూడ నూతన గ్రామపంచాయతీ ప్రారంభం

కెసిఆర్ హయాంలో గ్రామాలకు మహర్దశ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , అమీన్పూర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో కోటి యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో పూర్తి నిరాదరణకు గురైన గ్రామ పంచాయతీలు నేడు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ మంచినీరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, ట్రాక్టరు, ట్యాంకర్, ప్రతినెల నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకునీ వెళుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలని కోరారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. నూతనంగా ఏర్పడిన గ్రామాలతో పాటు, శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు తొలగించి ఆధునిక హంగులతో భవనాల నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతామని అన్నారు.

గ్రామస్థాయిలో సర్పంచులు ప్రతిరోజు ఉదయం గ్రామంలో పర్యటించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నప్పుడే సమస్యలు తెలుస్తాయని, ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట వరకు 67 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారి పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా మని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నీతిశా శ్రీకాంత్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago