Telangana

గణేష్ గడ్డ దేవాలయం అభివృద్ధికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఆగస్టు 16న గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం రాజ గోపురాల ప్రారంభోత్సవం

సాలహారం పనులను వేగవంతం చేయండి

ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో రాజగోపురాల నిర్మాణం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో నిర్మించిన మూడు రాజగోపురాలను ఆగస్టు 16వ తేదీన ప్రారంభించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అదే రోజు ఆలయ శిఖర ప్రతిష్టాపన సైతం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం గణేష్ గడ్డ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గం, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, ఆలయ ధర్మకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడికి నాలుగు వైపుల నిర్మిస్తున్న రాజ గోపురాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో వీటిని నిర్మించినట్లు తెలిపారు. ఆలయంలో నిర్మిస్తున్న సాలహారం పనులు మందకొడిగా కొనసాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ పురోహితులు, పాలకవర్గం సూచనలతో ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గుడిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆలయానికి అదనపు ఆదాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గాయత్రి పాండు, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ యాదవ్, నరసింహారెడ్డి, వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago