ఆగస్టు 16న గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం రాజ గోపురాల ప్రారంభోత్సవం
సాలహారం పనులను వేగవంతం చేయండి
ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో రాజగోపురాల నిర్మాణం
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు :
గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో నిర్మించిన మూడు రాజగోపురాలను ఆగస్టు 16వ తేదీన ప్రారంభించబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అదే రోజు ఆలయ శిఖర ప్రతిష్టాపన సైతం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం గణేష్ గడ్డ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గం, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, ఆలయ ధర్మకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడికి నాలుగు వైపుల నిర్మిస్తున్న రాజ గోపురాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో వీటిని నిర్మించినట్లు తెలిపారు. ఆలయంలో నిర్మిస్తున్న సాలహారం పనులు మందకొడిగా కొనసాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ పురోహితులు, పాలకవర్గం సూచనలతో ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గుడిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆలయానికి అదనపు ఆదాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గాయత్రి పాండు, శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ యాదవ్, నరసింహారెడ్డి, వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణ అధికారి లావణ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…