మాట ఇచ్చారు ఐదు లక్షలు అందించారు
పటాన్చెరు సత్యసాయి సేవా సమితికి అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీ సత్య సాయిబాబా సేవాసమితి ఆధ్వర్యంలో సమాజ అభివృద్ధికి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని.. నవంబర్లో జరగనున్న సత్య సాయిబాబా గురుపూర్ణిమ ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గము నుండి 3000 మంది భక్తులు తరలి వెళ్తున్నారని ఇందుకోసం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గల సత్య సాయి బాబా మందిరంలో గురు పూర్ణిమ పురస్కరించుకొని వంద రోజులపాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే జీఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అట్టడగు వర్గాల అభివృద్ధికి సత్య సాయి బాబా చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాయని తెలిపారు. పటాన్చెరులో సత్యసాయి బాబా మందిరం నిర్మాణానికి సైతం గతంలో తాను సంపూర్ణ సహకారం అందించినట్టు గుర్తు చేశారు. సత్య సాయి బాబా సేవ సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోనూ గతంలో ప్రజలకు ప్రత్యేక నీటి ట్యాంకులు నిర్మించి మంచినీటిని అందించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సత్య సాయిబాబా మందిరాలు నిర్మాణాలకు భూమిని సైతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సత్యసాయి బాబా సేవాసమితి బాధ్యులు రామి రెడ్డి, వెంకటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…