Telangana

పది ఫలితాలలో పటాన్ చెరు కృష్ణవేణి ప్రభంజనం

– 578 మార్కులతో పట్టణ టాపర్ గా నిలిచిన కే నిశ్చితారెడ్డి

– 550 పైగా మార్కులు సాధించిన తొమ్మిది మంది

– 500 పైగా మార్కులు సాధించిన 47 మంది విద్యార్థులు

– శత శాతం ఉత్తీర్ణతతో చాటిన విద్యార్థులు

నిష్టాతులైన ఉపాధ్యాయులే మా విజయం , విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు

కృష్ణవేణి,మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పది ఫలితాలలో పటాన్ చెరు కృష్ణవేణి ప్రభంజనమే సృష్టించింది. గత బుధవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో పటాన్ చెరు పట్టణంలోని సీతారామపురం లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు తమ అత్యుత్తమ సత్త చాటడంతోపాటు, 578 మార్కులతో కే, నిశ్చితారెడ్డి పట్టణ టాపర్ గా నిలువగా,9 మంది విద్యార్థులు 550 పైగా మార్కులు,47 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. శుక్రవారం పట్టణంలోని సీతారామపురంలోని కృష్ణవేణి పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ నాగరాజు అచ్చే ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కృష్ణవేణి, మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజు సంగాని టాపర్ గా నిలిచిన నిశ్చితారెడ్డి తో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించడంతోపాటు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నాగరాజు, నిష్టాతులైన ఉపాధ్యాయుల బోధించడంతోనే ఈరోజు కృష్ణవేణి ప్రభంజనం సృష్టించడంతోపాటు టాపర్ గా నిలిచిందన్నారు. ఈ విజయం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు దక్కుతుందన్నారు.మేము కష్టపడడం మానేస్తామని అనుకోవద్దని, మీరు ఇంటర్ లో కూడా బాగా కష్టపడి మంచి ర్యాంకు తో విజయం సాధించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించినప్పుడే మీరు తల్లిదండ్రులకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు ఇచ్చే గొప్ప గౌరవంగా భావిస్తామన్నారు. ప్రిన్సిపల్, డైరెక్టర్ అచ్చే నాగరాజు మాట్లాడుతూ ప్రతిభవంతులైన ఉపాధ్యాయుల బోధన, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవడంతో నే ఉత్తమ ఫలితాలు సాధించి పటాన్ చెరు పట్టణంలోనే టాపర్ గా నిలిచామన్నారు. పట్టణ టాపర్ గా నిలిచిన నిశ్చితారెడ్డి తోపాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాభివందనాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,ఉపాధ్యాయురాలు,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago