_ఛట్ పూజ సందర్భంగా చెరుకు పంపిణీ
మనవార్తలు ,పటాన్ చెరు:
విభిన్న సంస్కృతులకు నిలయంగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా.. ఆదివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెరుకును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని, వారి సంస్కృతి సంప్రదాయాలకు సమ ప్రాధాన్యత అందిస్తున్నామని అన్నారు. వారి కష్టసుఖాల్లో వెన్నంటి నిలుస్తున్నామని తెలిపారు. ఛట్ పూజ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక మైత్రి మైదానంలో భారీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్తర భారతీయులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ధనరాజ్ గౌడ్, సందీప్ షా, జై కిషన్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…