Telangana

అభివృద్ధిలో ఆదర్శంగా పటాన్చెరు

_7 కోట్ల 48 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ )

ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండలం పరిధిలోని పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ముత్తంగి, పాశమైలారం, లక్డారం, చిట్కుల్ గ్రామాలలో 7 కోట్ల 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాల్లు, మన ఊరి మనబడి పథకం పనులు, బ్రిడ్జిల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.పెద్దకంజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన 30 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

ఇటీవల మృతి చెందిన చిన్న కంజర్ల గ్రామానికి చెందిన రైతు గౌస్ ఖాన్ కుటుంబానికి రైతు బీమా ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును మృతుడి కుటుంబానికి ఆయన అందజేశారు.ముత్తంగి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడు మత్స్యకార సహకార సంఘాలకు ఆరు లక్షల 50వేల చేప పిల్లలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి గల్లీలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పచ్చదనం పెంపొందించేలా నర్సరీలు, మిషన్ భగీర ద్వారా రక్షిత మంచినీరు, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం అందించే నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలను స్థానిక ప్రజాప్రతిని ద్వారా ఇప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.ఒకే రోజు 7 గ్రామాల్లో ఏడుకోట్ల 50 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలులోను తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రజాప్రతినిదుల భాగ్యస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని అన్నారు.చేప పిల్లల పంపిణీలో అలసత్వం వహించవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పంపిణీ చేపట్టాలని మత్స్య శాఖ అధికారులకు సూచించారు.

పటాన్చెరు నియోజకవర్గం లోని 55 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మన ఊరి మనబడి పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం శ్రీకారం చుట్టిందని అన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago