Telangana

​సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం  శుభపరిణామం – యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి,సంగారెడ్డి:

సంగారెడ్డి ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆదర్శ తపాలా కార్యాలయంగా ఆధునీకరించడంతో పాటు ప్రత్యేక పార్సెల్ నిర్వహణ విభాగం మరియు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్   స్పందించి, సంబంధిత శాఖకు పంపడం శుభపరిణామమని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ అన్నారు.ఈ సందర్బంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ సంయుక్తంగా మాట్లాడుతూ సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రజల డిమాండ్‌పై గతంలో ప్రజలు, విద్యార్థులు, యువత నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కి, ఈ అంశంపై చొరవ తీసుకున్న మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు మాధవనేని కి యువజన సంఘాల సమితి తరఫున మెట్టుశ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటైతే జిల్లాలోని విద్యార్థులు, విదేశాలకు వెళ్లే యువత, సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే పాస్‌పోర్ట్ సేవలు పొందే అవకాశం కలుగుతుందని మెట్టు శ్రీధర్ అన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

6 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

6 hours ago