మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ( జీఎస్బీ ) హెదరాబాద్ ఆధ్వర్యంలో 26-27 మే 2022 న ‘ ఎమోషనల్ ఇంటెలిజెన్స్’పై రెండు రోజుల ఇ – మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ యాజమాన్య వికాస కార్యక్రమంలో పాల్గొనే వారికి వ్యక్తిగత , వ్యక్తుల మధ్య ప్రభావానికి దారితీసే నెపుణ్యాలను అభివృద్ధికి దోహదపడుతుందన్నారు . పని ప్రదేశంలో భావోద్వేగ మేధస్సు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం , స్వీయ సంబంధాలను అర్థం చేసుకునే మార్గాలను తెలుసుకోవడం , సమర్థమైన నిర్వహణను అలవరచుకోవడం , సామాజిక అవగాహనను పెంపొందించుకోవడం , నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం వంటివి ఈ కార్యక్రమ లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు .
ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న జూనియర్ , సీనియర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఉద్దేశించినట్టు డాక్టర్ కరుణాకర్ తెలిపారు . ఇందులో పాల్గొనే వారందరికీ ఇ – సర్టిఫికెట్ జారీచేస్తామన్నారు . పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నందున ముందొచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు . ఆసక్తి గల అభ్యర్థులు ( https://forms.gle/ X64fYE11erCdeeth8 ) లింక్ ద్వారా దరఖాస్తును పూరించడం తప్పనిసరన్నారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ కె.ఎన్ . రేఖ , అసిస్టెంట్ ప్రొఫెసర్ , 91600 93544 ను సంప్రదించాలని లేదా rkrishna3@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని జీఎస్బీ డెరైక్టర్ సూచించారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…