మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ( జీఎస్బీ ) హెదరాబాద్ ఆధ్వర్యంలో 26-27 మే 2022 న ‘ ఎమోషనల్ ఇంటెలిజెన్స్’పై రెండు రోజుల ఇ – మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ యాజమాన్య వికాస కార్యక్రమంలో పాల్గొనే వారికి వ్యక్తిగత , వ్యక్తుల మధ్య ప్రభావానికి దారితీసే నెపుణ్యాలను అభివృద్ధికి దోహదపడుతుందన్నారు . పని ప్రదేశంలో భావోద్వేగ మేధస్సు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం , స్వీయ సంబంధాలను అర్థం చేసుకునే మార్గాలను తెలుసుకోవడం , సమర్థమైన నిర్వహణను అలవరచుకోవడం , సామాజిక అవగాహనను పెంపొందించుకోవడం , నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం వంటివి ఈ కార్యక్రమ లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు .
ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న జూనియర్ , సీనియర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఉద్దేశించినట్టు డాక్టర్ కరుణాకర్ తెలిపారు . ఇందులో పాల్గొనే వారందరికీ ఇ – సర్టిఫికెట్ జారీచేస్తామన్నారు . పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నందున ముందొచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు . ఆసక్తి గల అభ్యర్థులు ( https://forms.gle/ X64fYE11erCdeeth8 ) లింక్ ద్వారా దరఖాస్తును పూరించడం తప్పనిసరన్నారు . పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ కె.ఎన్ . రేఖ , అసిస్టెంట్ ప్రొఫెసర్ , 91600 93544 ను సంప్రదించాలని లేదా rkrishna3@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని జీఎస్బీ డెరైక్టర్ సూచించారు
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…