Hyderabad

మాది రైతుప్రభుత్వం..కేసీఆర్

మాది రైతుప్రభుత్వం..కేసీఆర్

–రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు
–సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
–పలు భవనాలకు ప్రారంభోత్సవం
–అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని వెల్లడి
–ఒకే రోజు రెండు జిల్లాలలో పర్యటన అధికారుల ఉక్కిరిబిక్కిరి

సిద్దిపేట:

ముఖ్యమంత్రి కేసీఆర్ చాల రోజుల తరువాత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు …. ఒక్క రోజులోనే రెండు జిల్లాలు పర్యటించడం బహుశా ఎన్నకల తరువాత ఇదేనేమో ….. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇక అధికారులకు ముచ్చమటలే ….. బందో బస్తు …. చెప్పాల్సిన పనిలేదు …..ముందస్తు అరెస్టులు …… షరామామూలే …. దీనితో ఉక్కిరిబిక్కిరిగా అధికారయంత్రాంగం పరుగులు …. కామారెడ్డి లో బీజేపీ ,కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆయా పార్టీలు స్పందించాయి. ముఖ్యమత్రి పర్యటన సందర్భంగా వినతులు వినతులు ఇవ్వడం కూడా నేరమా అని ప్రశ్నించారు…..
తొలుత సిద్ధిపేట పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ నిర్మించిన పలు భవన సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఎవరేమనుకున్నా తాము పట్టించుకోవడంలేదని, తమ పని తాము చేసుకుపోతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందే మిషన్ కాకతీయ రూపకల్పన చేశామని వెల్లడించారు.

తమది రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో ముందున్న పంజాబ్ ను కూడా అధిగమించామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ వస్తోందని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తోలు తీయాలని అధికారులకు నిర్దేశించారు. ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు.

ధరణి పోర్టల్ గురించి చెబుతూ, రాష్ట్రంలో భూఅక్రమాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని అన్నారు. ఒక్కసారి ధరణి పోర్టల్ లో భూమి వివరాలు నమోదైతే, ఆ భూమి సొంతదారు ఇక నిశ్చింతగా ఉండొచ్చని పేర్కొన్నారు. వీఆర్ఓ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు ఎవ్వరూ ఆ వివరాలను మార్చే వీల్లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ విభాగంలో 37 చట్టాలున్నాయని, ఎలాంటి లొసుగులకు తావులేని విధంగా ధరణి పోర్టల్ ను పకడ్బందీగా రూపొందించేందుకు మూడేళ్లు శ్రమించామని తెలిపారు.

అత్యాధునిక హంగులతో జీ 1తో ఎకరం విస్తీర్ణంలో కట్టిన బంగళాను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్ ను ఆఫీసు కోసం, మొదటి అంతస్తును నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆయన కొండపాక మండలం రాంపల్లి శివారులో నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. అక్కడ ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తర్వాత అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాలనూ ప్రారంభించారు. పూజలు చేసి వాటిని ఓపెన్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Venu

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago