Hyderabad

ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌…

ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌…
– తప్పిన ప్రమాదం

హైదరాబాద్:

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. జిల్లాలోని దుద్దెడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, అద్రుష్టవశాత్తు మంత్రి హరీశ్ రావు క్షేమంగానే ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌కు అడ్డంగా సడెన్‌గా అడవి పందులు అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా ఉన్న కారు ఆగిపోవడంతో ఆ వాహానాన్ని మంత్రి హరీశ్ రావు కారు ఢీకొంది.

ఓ అడవిపంది ఉన్నట్టుండి సడన్ గా రోడ్డుపైకి రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ అప్లై చేశారు. దాంతో కాన్వాయ్ లోని మిగతా వాహనాల డ్రైవర్ లు కూడా సడెన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్నా వాహనాలు ఒకదానికి ప్రమాదానికి గురైయ్యాయి. . దాంతో కాన్వాయ్ లో వెనుకగా వస్తున్న ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంత్రి హరీశ్ రావు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం కాన్వాయ్ తిరిగి హైదరాబాద్ బయల్దేరింది. నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటించిన నేపథ్యంలో, ఆర్థికమంత్రి హరీశ్ రావు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరిగి హైదరాబా వెళ్లుతున్నడగా ఈ ఘటన చోటు చేసుకున్నది .మంత్రి తో పాటు కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న వారికీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు . దీనితో అందరు ఊపిరి పీల్చుకొని హైదరాబాద్ ప్రయాణమైయ్యారు.

Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago